బ్రేకింగ్‌ : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అన్ని ఆ కులాలకే !

-

స్థానిక సంస్థల కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. పార్టీ అధిష్టానం తరఫున.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పదువుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిదేనని స్పష్టం చేశారు సజ్జల. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించామన్నారు. ఇదే ఆఖరు కాదు…ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి తర్వాత అవకాశం ఉంటుందని సజ్జల అన్నారు. ఏపీలో  మొత్తం  11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయని చెప్పారు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు
విజయనగరం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా – ఇందుకూరి రఘురాజు (క్షత్రియ సామాజిక వర్గం)
విశాఖపట్నం స్థానిక సంస్థల అభ్యర్థి – వంశీకృష్ణ యాదవ్ (బీసీ,.యాదవ), వరుదు కళ్యాణి – కప్పుల వెలమ ( బీసీ)
తూర్పుగోదావరి లోకల్ కోటా – అనంతబాబు (ఓసీ కాపు)
కృష్ణ – తలసిల రఘురాం (ఓసీ‌, కమ్మ), మొండితోక అరుణ్ కుమార్, ఎస్సీ, మాదిగ
గుంటూరు – ఎమ్.హనుమంతరావు… (చేనేత, బీసీ) ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు- (కాపు)
ప్రకాశం జిల్లా – టి. మాధవ రావు (ఓసీ, కమ్మ)
చిత్తూరు – భరత్ (ఎస్సీ)

Read more RELATED
Recommended to you

Latest news