ఆత్మకూరులో దూసుకుపోతున్న వైసీపీ..30 వేల ఓట్ల మెజార్టీ

-

నెల్లూరు : ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఆత్మకూరు ఉప ఎన్నిక లో వైసీపీ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక 7 వ రౌండ్ ఫలితాలు విడుదల అయ్యే సరికి… 28, 918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.

ఇక ఈ 7వ రౌండ్‌ వరకు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కి : 35479 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కి 6561 ఓట్లు రాగా… బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు కు 1702 ఓట్లు వచ్చాయి. ఇక నోటా కు 1485 ఓట్లు పోల్‌ అయ్యాయి.

అయితే.. 8వ రౌండ్‌ వచ్చే సరికి… కౌంటింగ్ హాలు నుండి బయటకు వెళ్ళి పోయారు బీజేపీ పార్టీ అభ్యర్థి భరత్ కుమార్. నాలుగు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి లభించిన ఓట్లు కేవలం 3658 ఓట్లు మాత్రమే. ఈ లెక్కన ఆత్మకూరు లో వైసీపీ పార్టీ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news