వైసీపీ మంత్రి అత్యుత్సాహం.. సీఎం జగన్ ఔట్ డేటెడ్ అని ఆరోపణ..!!

-

సాధారణంగా మనుషులకు కోపం వచ్చినా.. ఆవేశం వచ్చినా నోటిలో నుంచి వచ్చే మాటలు వారికే అర్థం కావు. ఆ అత్యుత్సాహంలో ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. అలా ఏపీలో ఓ మంత్రి తన అత్యుత్సాహంతో సొంత పార్టీ ముఖ్యమంత్రినే అనరాని మాటలు అని ఇరకాటంలో పడ్డాడు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న ధ్వేషంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. చంద్రబాబుకు బదులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔట్ డేటెడ్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

సామాజిక న్యాయభేరి పేరిట ఏపీ మంత్రులు బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మూడో రోజు కొనసాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం కృష్ణా జిల్లాకు చేరింది. గన్నవరం వద్ద నిర్వహిస్తున్న సభలో ఏపీ సివిల్ సప్లై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అదే అత్యుత్సాహంలో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయి ఈర్ష్య, ధ్వేషం, కుళ్లు, కుతంత్రాలతో దుర్మార్గంగా ఆలోచిస్తున్న సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారాడు. టీడీపీ మహానాడులో చంద్రబాబు, లోకేష్ ఫోటోలు మాత్రమే కనిపించాయని, మిగిలిన నాయకుల ఫోటోలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కాగా, మంత్రి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news