బ్రేకింగ్: ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్… మరో గంటలో ఢిల్లీ…?

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కాసేపటి క్రితం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్మీ ఆస్పత్రిలో దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఆయనకు చికిత్స జరుగుతుంది. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన అవసరం లేదని వైద్యులు లాయర్లకు చెప్పారని సమాచారం.

కాసేపటి క్రితం ఆర్మీ ఆస్పత్రికి వెళ్ళిన లాయర్లు ఆర్మీ ఆస్పత్రి వైద్యులకు పత్రాలను సమర్పించారు. ఇక వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడిన నేపధ్యంలో డిశ్చార్జ్ చేసారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన బేగం పేట విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడి నుంచి సొంత విమానంలో ఢిల్లీ వెళ్ళారు. మరో గంటలో ఆయన ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news