అమ్మాయి ఫోటో పెట్టుకొని.. యువతులకు వల.. ఆ తరువాత..

-

రోజు రోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో అడ్డా దారులు తొక్కుతూ.. యువతులకు వల వేస్తూ ఆ తరువాత వేధింపులకు గురి చేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజమండ్రికి చెందిన వంశీకృష్ణ ఉద్యోగం కోసం 2014లో హైదరాబాద్ వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న పనులు చేసిన వంశీకృష్ణ..తరువాత బెట్టింగుల వైపు దృష్టిపెట్టాడు. ఆ తరువాత ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 6 ఏళ్ళ క్రితం కొందరు యువతీయువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. దీనిపై అప్పట్లో కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో వంశీకృష్ణపై కేసు కూడా నమోదు అయింది.

cyber crime

ఆనాటి నుంచి అతను పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. అయితే.. ఇప్పుడు వంశీకృష్ణ ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాలు సృష్టించి..వాటిలో తన ఫోటోకి బదులుగా అందమైన యువతి ఫోటో పెట్టి.. మహిళలు, యువతులే లక్ష్యంగా సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకున్నాడు. తాను కూడా అమ్మాయిగానే పరిచయం చేసుకున్న వంశీకృష్ణ..వారికీ తనపై నమ్మకం కలిగించేందుకు అప్పుడప్పుడు వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తుండేవాడు. మనోడి మోసానికి ఎమ్మెల్యే ఫోటో కూడా సాక్ష్యంగా నిలిచింది. ఎమ్మెల్యే ఫోటోతో ఇన్స్టా ఖాతా తెరిచిన వంశీ..ఎమ్మెల్యేగానే యువతులతో చాటింగ్ చేసేవాడు.

అనంతరం వారితో పలుమార్లు ఆర్ధిక లావాదేవీలు జరిపి నమ్మకం కలిగించాడు. అంతేకాదు ఆన్ లైన్ మాట్రిమోనిలో రిజిస్టర్ అయిన వితంతువులు, విడాకులు పొందిన మహిళలే లక్ష్యంగా వారిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. 2016 నుంచి ఇప్పటివరకు 500 మంది మహిళలను వంశీకృష్ణ మోసం చేసినట్లు తెలిసింది. అయితే వారిలో కేవలం 10 – 12 శాతం మంది మాత్రమే అంటే 50, 60 మంది మహిళలే వంశీకృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల వేట అనంతరం వంశీకృష్ణను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news