మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి త్లలి మృతి

-

హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రియురా లు, తల్లిని కత్తితో పొడిచాడు ఓ ప్రియుడు. ఈ సంఘటన మియాపూర్ ఆదిత్య నగర్ లో ఇవాళ చోటు చేసుకుంది. ప్రియురాలు, తల్లిని కత్తితో పొడిచాడు ప్రియుడు సందీప్. అయితే, ఈ ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి త్లలి మృతి చెందింది. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలి తల్లి శోభా మృతి చెందింది.

ఇక మరికాసేపట్లో శోభా మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. అటు మియాపూర్ నుండి గాంధీకి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మరో వైపు గాంధీలోనే కోలుకుంటున్న బాధితురాలు వైభవి, ఉన్మాది సందీప్ దాడి లో గాయపడ్డ బాధితురాలికి 22 కుట్లు వేశారు వైద్యులు. బాధితురాలి చేతికి 10 కుట్లు, ఛాతీ కి 12 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం నిలకడగా వైభవి ఆరోగ్యం ఉంది. అటు కోటి ఈఎన్‌టీ లో చికిత్స పొందుతున్నాడు ఉన్మాది సందీప్. సందీప్ ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news