ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్ రిలీఫ్‌… స‌రైన స‌మ‌యంలో జ‌గ‌న్ బెస్ట్ డెసిష‌న్‌

-

సుడిగుండంలో కొట్టుకు పోయేవాడికి ఏ చిన్న ఆద‌రువు దొరికినా హ‌మ్మ‌య్య అనుకుని ఒడ్డున ప‌డ‌తాడు. ఇప్పుడు అలాంటి నిర్ణ‌య‌మే ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంది. ఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వాళ్లు, కూలిపనులు, చిన్న జీతాలతో నెట్టుకొస్తున్న వాళ్లు సహజ మరణం చెందినా, లేదా ప్రమాదవశాత్తూ మరణించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌ఐసీ కలిసి బాధితులకు బీమాను అందించేవి. వయస్సుల వారీగా, సహజ మరణానికి ఒక తరహా బీమా ప్రమాదవశాత్తూ మరణిస్తే మరో రకమైన బీమాను చెల్లించేవి. అయితే గడచిన నవంబర్‌ నుంచి ఈ క్లెయిములు పరిష్కారం నిలిచిపోయింది.

ఈ అంశంపై వెంటనే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలుమార్లు లేఖ రాశారు. దీనికి స్పందిం చిన ప్రధాని మోడీ సమస్య‌ను వెంటనే పరిష్కరించాలని కోరతూ ఎల్‌ఐసీకి లేఖ కూడా రాశారు. అయినా సరే ఇప్పటివరకూ క్లెయిమ్‌లను మంజూరు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సహజ మరణాలు, ప్రమాదాల వల్ల పెద్ద దిక్కును కోల్పోయిన ఆయా కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం భావించారు.

క్లెయిమ్‌ల మంజూరు కోసం పోరాటం చేస్తూనే, దానితో ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ. 400 కోట్లు ఇవ్వాలని సంకల్పించారు. ఒకవేళ బీమా సంస్థ తాను ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకపోతే బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా లాంటి విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో, ప్రభుత్వం ఆదాయం పడిపోయినా పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేసింది.

గడచిన నవంబర్‌ నుంచి పరిష్కారం కాని క్లెయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని ప్ర‌భుత్వం సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది. మొత్తంగా రూ.400 కోట్లు బాధితుల‌కు అందించేందుకు అధికారులు శ‌నివారం నుంచి ప్ర‌య‌త్నాలు ప్రారంభించ‌నున్నారు. మొత్తానికి క‌రోనా స‌మ‌యంలో ఈ మాత్రం సాయం చేయ‌డం మంచి నిర్ణ‌య‌మే క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news