తెరాస అధినేతకు జగన్ లేఖ…

-

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి  తెలంగాణ సీఎం కేసీఆర్ కి శనివారం ఓ లేఖ రాశారు. లేఖలో ప్రధానంగా తెలంగాణలోని అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. ఉద్యోగుల అభీష్టం, వారి చాయిస్ ఆధారంగా మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖ విషయమై తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగుల్లో తీవ్ర చర్చకొనసాగుతోంది. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటే ఇక మెజార్టీ ఉద్యోగులు సైతం అటు జగన్ కి ఇటు సీఎం కేసీఆర్ కి జై కొట్టక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news