బంగారు తెలంగాణ అని చెప్పి.. బారులు, బీరుల తెలంగాణగా మార్చారు : కెసిఆర్ పై షర్మిల ఫైర్

-

బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ….బీరుల తెలంగాణగా మార్చారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినదని.. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదని మండిపడ్డారు.

Sharmila
Sharmila

ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు ఉన్నాయని.. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోందన్నారు. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరని నిప్పులు చెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీ33 శాతం, తెలంగాణ లో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం పోస్టులు ఖాళీలేనని… విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా….మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా ? అని నిలదీశారు. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా…? అని ప్రశ్నించారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరేనని ఫైర్ అయ్యారు. వైఎస్ ను కించపరిచేలా కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే నేను వారి అవినీతి పై వంద మాట్లాడుతానని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news