రేపటి నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర.. షెడ్యూల్‌ ఇదే

-

వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల పాదయాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్ల పై లోటస్ పాండ్ లో రాష్ట్ర కార్యవర్గం సమావేశం అయింది. చేవెళ్ళలో రేపు ఉదయం 11 గంటలకు షర్మిల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ భారీ బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. 14 నెలలు, 4 వేల కిలో మీటర్లు, 90 నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు వైఎస్‌ షర్మిల.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ప్రతి రోజు 12 కిలో మీటర్లు పాదయాత్ర చేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు వైఎస్‌ షర్మిల.
ఈ తరం యువతకు నవతరం న్యాయకత్వం స్లోగన్ తో షర్మిల పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ సంక్షేమ పాలన ఎజెండా గా పాదయాత్ర నిర్వహించనున్నారు షర్మిల. ప్రతి రోజు రచ్చ బండ మాదిరిగా మాట ముచ్చట కార్యక్రమం, ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాలు టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. పాదయాత్రలో పార్టీలో చేరికలు.. గ్రామాల వారీగా పార్టీ బలోపేతం పై సమావేశాలు కూడా జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పాదయాత్ర లో 9 భారీ భహిరంగ సభలు నిర్వహించనున్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news