బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరిన వైఎస్ షర్మిల.. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని సూచించిన వైఎస్ షర్మిల… కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు.

కలిసి పోరాటం చేయక పోతే ప్రతిపక్షాలను తెలంగాణలో కెసిఆర్ బ్రతకనివ్వడని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. అయితే.. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు మద్దతు తెలిపారు బండి సంజయ్. త్వరలో సమావేశం అవుదామని చెప్పిన బండి సంజయ్… నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని…రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news