‘ఏ నేతపైనా ఇన్ని కుట్రలు జరగలేదు’… వైఎస్ విజయమ్మ

-

కత్తి అదుపు తప్పి గొంతులో గుచ్చుకుంటే…మీరు చూపించిన ప్రేమే నా బిడ్డను కాపాడింది…

వైసీపీ అధినేత జగన్ మోమన్ రెడ్డి పై విశాఖ విమానాశ్రయంలో దాడిజరిగిన తర్వాత తొలిసారిగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయ్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  దేశంలో ఏ నేతపై నా ఇన్ని కుట్రలు జరగలేదు, రాష్ట్రంలో జగన్ కి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతుందన్నారు.  కోట్ల మంది ప్రజల ఆశీస్సులే తన బిడ్డను కాపాడాయని విజయమ్మ అన్నారు. రాష్ట్ర ప్రజలతో మా కుటుంబానికి నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. వైఎస్‌ఆర్‌ సీఎం అయ్యాక ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. నాన్న నన్ను ఒంటరి చేయలేదమ్మా… ఇంతపెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్లారంటూ జగన్‌ ఎప్పుడూ చెబుతుంటారు..అందుకే  ఏడు సంవత్సరాలుగా జగన్‌.. కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువగా గడుపుతున్నారు. గతంలో ఓదార్పు యాత్రకుల వెళ్లినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కి ప్రజల నుంచి అనూహ్య స్పందన వంచిదన్నారు. ఈ మధ్య కాలంలో తన కోడలు భారతి పై కూడా పలు కేసుల్లో పెట్టి ఇరికించాలకున్నారు. అందులో భాగంగానే ఈడీ తన పేరును చేర్చాలని ప్రయత్నించినట్లు తెలిపారు. విమానాశ్రయంలో జరిగిన దాడి అంతా పధకం ప్రకారమే జరుగుతుందన్నారు.

ప్రతపక్ష నేతపై దాడి జరుగుతుందని నాలుగు నెలల క్రితమే ఒకాయన చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే దాడి జరిగింది. గుంటూరు, గోదావరి జిల్లాల్లో జగన్‌ను అంతమొందించేందుకు రెక్కీ జరిగినట్లు తెలిసింది. వైఎస్ పట్ల ఉన్న అభిమానంతో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి … సీబీఐ, ఐటీ, ఈడీ దాడుల పేరుతో ఆర్థికంగా అణగదొక్కాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే నా బిడ్డను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. దేశంలో ఇప్పటివరకు ఏ నేతను కూడా ఏ నేతపైనా ఇన్ని కుట్రలు జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news