వైసీపీ కార్యకర్తలకు బంపరాఫర్.. 20 వేల మందికి ఉద్యోగాలు

-

ఏప్రియల్ 16, 17 తేదీల్లో తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళ నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానుల కోసమే ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నామని.. పూర్తిగా పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమం ఇది అని ఆయన చెప్పారు. ఏప్రియల్ 23, 24 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీలో , ఏప్రియల్ 30, మే ఒకటవ తేదీన నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళ ఉంటుందని స్పష్టం చేశారు.

తిరుపతి జాబ్ మేళాకు రాయలసీమ, ఆంధ్ర యూనివర్సిటీలో ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు నాగార్జున యూనివర్సిటీలో హాజరు కావాలని వెల్లడించారు.

ఈ మూడు జాబ్ మేళాల్లో 15 నుంచి 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని స్పష్టం చేశారు. స్పాట్ లోనే ఇంటర్వ్యూ, ఎంపిక అయితే వెంటనే నియామక పత్రాలు ఇస్తారని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 34 వేలకు పైగా ఉద్యోగాల కల్పించిన చరిత్ర ఈ ప్రభుత్వానిదే అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news