YSR నా బెస్ట్ ఫ్రెండ్ కానీ..అందుకే అతడితో శత్రుత్వం.. చంద్రబాబు నాయుడు..!!

-

ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్స్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు , ఆయన కొడుకు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా వచ్చారు.. ఇకపోతే నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సీరియస్ గానే ఉంటారు .. అసెంబ్లీలో అయినా.. పార్టీ మీటింగ్స్ లో అయినా.. ఆయన నవ్విన సందర్భాలు చాలా తక్కువ.. ముఖ్యంగా చంద్రబాబు నవ్వు గురించి అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీలోనే సెటైర్లు వేశారు. నవ్వడం ఒక భోగం .. నవ్వకపోవడం ఒక రోగం.. ఆయన నవ్వలేరు అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు వైఎస్ఆర్.. చంద్రబాబు వ్యవహార శైలే అలా ఉంటుంది.. ఆయన నవ్వడం చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది అంటూ ఆయన సన్నిహితులే తెలియజేశారు.

ఎట్టకేలకు తన బావమరిది బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు చంద్రబాబు. ఈ షో కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇందుకు కారణం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ఉల్లాసంగా , ఉత్సాహంగా కనిపించడం మరొక ఎత్తు. ఇక చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను బాలకృష్ణ ఈ షో ద్వారా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇక అందులో భాగంగానే ఎన్నో విషయాలను అడిగిన బాలకృష్ణ .. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అని చంద్రబాబును ప్రశ్నించారు.

వైయస్సార్ అని ఆయన సమాధానం ఇచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్ పార్టీ సీఎం దివంగత రాజశేఖరరెడ్డి ఆప్త మిత్రుడు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంతలా ఆప్త మిత్రులైన వీరి మధ్య శత్రుత్వం ఎలా మొదలైంది? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక రాజకీయ పార్టీలే వీరిద్దరి మధ్య శత్రుత్వాన్ని పెంచాయా అన్న కోణంలో కూడా అభిమానులు ఆరాతీస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాలు అనే ఒక చదరంగంలో ఆప్తమిత్రులు ఇద్దరు బలయ్యారు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news