సామాజిక భద్రత… ఇదే వైసీపీ మేనిఫెస్టో లక్ష్యం

-

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో 2024(YSRCP Manifesto 2024)ను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని చెప్తూ ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో విడుదల చేసినట్టు జగన్ పేర్కొన్నారు.2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో చాలావరకు ఇప్పుడు కూడా వైసీపీ కొనసాగిస్తూ ఎక్కువ మొత్తంలో ఇస్తామంటూ వాటిని అప్‌డేట్‌ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వాటిపై ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ… వాటిని పెంచేందుకు ఈ మేనిఫెస్టోలో మొగ్గు చూపించింది.

తాజా మేనిఫెస్టోలో సంక్షేమంపైనే ఎక్కువ ఫోకస్ చేసింది వైసీపీ.ముఖ్యంగా యువత, మహిళల కోసం ప్రత్యేక హామీలతో మేనిఫెస్టో రూపొందించారు.రెండు విడతల్లో పింఛన్లు 3500లకు పింఛన్లు పెంచుతామన్నారు. వైఎస్‌ఆర్ చేయూత కింద లక్ష యాభైవేల రూపాయలు,వైఎస్‌ఆర్ కాపు నేస్తం- రూ. 1.20,000, వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం- రూ. 1,05000, జగనన్న అమ్మఒడి – 17,000, వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 3,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు.

రైతుభరోసా 13500 నుంచి 16000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.పంట వేసే సమయంలో 8000, మధ్యలో 4000 మరియు కటింగ్ సమయంలో మిగతా 4000 ఇస్తామన్నారు.మత్య్సకారభరోసా కింద లక్ష రూపాయల అందిస్తామని అన్నారు.వాహన మిత్రలకు సహాయాన్ని లక్ష వరకు పెంచి లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపచేస్తామని అన్నారు.డ్రైవర్లు ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా కల్పిస్తామన్నారు.ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి అందులో చదువుకున్న అబ్బాయిలకు 2500, అమ్మాయిలకు 3000 వరకు స్టైపెండ్ ఇస్తామని చెప్పారు.మొత్తం జనాభాలో 50 శాతం దళితులు ఉండి 500పైగా ఆవాసాలు ఉంటే ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు.ఇక ప్రార్థనా మందిరాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు,తోపుడు బండ్ల వాళ్లకు ఇచ్చే డబ్బులను 15 వేల నుంచి 20 వరకు పెంపు,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తీసుకునే బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు.రానున్న ఐదేళ్లలో సురక్షిత తాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news