ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు రాష్ట్ర ప్ర‌ధాన ముస్లిం మైనార్టీ సంస్థ మ‌ద్ద‌తు

-

నాగ‌ర్‌క‌ర్నూల్ బీఆర్ఎస్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు అన్ని వ‌ర్గాల నుంచి విశేష‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆర్ఎస్పీని గెలిపించి, పార్ల‌మెంట్‌కు పంపిస్తామ‌ని నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ ప్ర‌జానీకం నిన‌దిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్రధాన ముస్లిం మైనార్టీ సంస్థ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌రిధిలోని ముస్లింలంతా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు ఓటు వేయాల‌ని ముస్లిం మైనార్టీ సంస్థ ప్ర‌తినిధులు విజ్ఞ‌ప్తి చేశారు. నిజ‌మైన సెక్యుల‌ర్ కేసీఆర్ అని వారు స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌తోనే మైనార్టీల బ‌తుకులు బాగు ప‌డుతాయ‌న్నారు. ముస్లింల‌కు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేద‌ని వారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news