కరోనాని జయించిన అంబటి..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో జనం భయపడిపోతున్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందరో ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా వైరస్ ని జయించి బయటపడుతున్నారు. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మహమ్మారిని జయించగా, తాజాగా.. అంబటి రాంబాబు కు ఈ మహమ్మారి నుంచి కొలుకున్నారు. ఇప్పుడు ఆయనకు కరోనా తగ్గిపోయినట్టుగా కన్ఫర్మ్ చేసి ట్వీట్ చేశారు.

“మీ అందరి ఆశీసుల వల్ల పది రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుని,నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యి ఈ రోజు ఇంటికి వచ్చాను. మరొక్క వారం రోజులు ఇంట్లోనే లో ఉండమని వైద్యుల సలహా.నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.” అంటూ ట్వీట్ చేసి తనకి నయం అయ్యినట్టు తెలిపారు. గత పది రోజుల కితం అంబటికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స కోసం ఆయన హైదరాబాద్ వెళ్ళిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news