బిగ్ బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా..!

-

తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. జలుబు రావటంతో ముందు జాగ్రత్తగా శనివారం కరోనా పరీక్ష చేయించుకున్నట్లు శివకుమార్ తెలిపారు. వారి కుటుంబంలో అందరికి పరీక్ష చేయగా.. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ‘చికిత్స తీసుకుంటున్నాన‌ని.. నియోజకవర్గంలో ప్రజలు అధైర్యపడొద్దు సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అని ఎమ్మెల్యే శివకుమార్‌ తెలిపారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని” ఎమ్మెల్యే శివకుమార్ ప్రజలను కోరారు. ఇటీవ‌లే కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి, శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన విష‌యం తెలిసిందే. అలాగే ఒక్క గుంటూరు జిల్లాలోనే 4,544 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తెనాలి, నరసరావు పేట, గుంటూరు, సత్తెనపల్లి, గురజాల, పొన్నూరు వంటి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news