వామ్మో బిర్యానికి ఇంత క్రేజ్ ఉందా…? నిమిషానికి ఎన్ని ఆర్డర్స్ అంటే

-

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. భారత్ లో ఆన్లైన్ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఈ పోస్ట్ చెప్తుంది. ఒక కొత్త పోస్ట్‌లో, జోమాటో “ఈ సంవత్సరం భారతదేశం ఎన్ని ఆర్డర్స్ ఇచ్చింది అనే సమాచారాన్ని మీమ్స్ ద్వారా విడుదల చేసింది. భారతదేశంలో వేజ్ బిర్యానీని ఎన్ని సార్లు చేసారు? అంటే… జోమాటో 2020 లో ప్రతి నిమిషానికి 22 ఆర్డర్లు బిర్యానీలను పంపిణీ చేసింది.

2020 లో 1,988,044 ప్లేట్ వెజ్ బిర్యానీలను జోమాటో పంపిణీ చేసింది. మేలో జోమాటలో పిజ్జా కోసం 4.5 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. జూలై నాటికి 9 లక్షలకు పైగా ఆర్డర్ లు… సెప్టెంబర్ నాటికి 12 లక్షలకు పైగా, నవంబర్‌లో 17 లక్షలకు పైగా పెరిగాయి. మహారాష్ట్రలోని జల్గావ్ నివాసితులలో ఒకరు 2020 లో 369 పిజ్జాలను ఆర్డర్ చేశారు. బెంగళూరు నివాసి అయిన యష్ 2020 లో జోమాటో నుండి 1,380 ఆర్డర్లు ఇచ్చాడు.

దీని అర్థం యాష్ ప్రతిరోజూ దాదాపు నాలుగు ఆర్డర్లు ఇచ్చారు. 1,99,950 విలువ చేసే ఆర్డర్ కూడా వచ్చింది. ఇది అత్యంత ఖరీదైన ఆర్డర్ గా చెప్పారు. దాదాపు 2 లక్షల రూపాయలు ఇది. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి రూ .66,650 డిస్కౌంట్ వచ్చింది. 39.99 రూపాయలు తగ్గించడంతో అతిచిన్న ఆర్డర్ 10.01 రూపాయలతో వచ్చింది. 2020 లో గులాబ్ జామున్ కోసం అత్యధిక సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయి. దీపావళి వారంలోనే లక్ష ఆర్డర్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news