ల్యాప్‌టాప్స్‌పై అద‌రిపోయే క్యాష్‌ బ్యాక్‌..

-

సాధార‌ణంగా పండగలు వస్తే చాలు ప్రముఖ కంపెనీలాన్ని ఆఫర్లతో పోటీపడుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం దసరా, దీపావళి పండుగల సీజన్లో ల్యాప్‌టాప్‌ తయారీ కంపెనీలు ఆఫర్లతో పోటీపడుతున్నాయి. కస్టమర్లు రూ.50,000 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ దక్కించుకోవచ్చు. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ సైతం అందుకోవచ్చు. వడ్డీ లేని వాయిదాల్లో ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. అష్యూర్డ్‌ గిఫ్ట్స్, రివార్డులు, బోనస్‌ పాయింట్లు అదనం.

అలాగే నెలవారీ వాయిదా రూ.1,400లతో ప్రారంభం అవుతుంది. హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్‌ కంపెనీలు కొత్త మోడళ్లతో రంగంలోకి దిగాయని ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్‌ ఎండీ మొహమ్మద్‌ అహ్మద్ ప్ర‌క‌టించారు. సీజన్‌ కోసం కంపెనీలు ఇప్పటికే 25 దాకా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news