జియో బంప‌ర్ ఆఫ‌ర్‌: మరోసారి ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ల‌తో జియో..

-

రిలయన్స్ జియో ఇటీవల ఇతర నెట్ వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే తన వినియోగదారులకు ఊరట కలిగించేలా, వారిలో మళ్లీ ఉత్సాహం కలిగించేందుకు జియో సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతోంది. జియో ‘ఆన్‌-ఇన్‌-వన్‌’ కింద కొత్త నెలవారీ రీచార్జ్‌ ప్లాన్లను విడుదల చేసింది. వీటితో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 2జీబీ డేటాతోపాటు నాన్‌ జియో మొబైల్‌ నెంబర్లకు ఫోన్‌ చేసేందుకు 1,000 నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది.

జియో నుంచి జియోకు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఒక నెల కాలపరిమితికి రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 ప్లాన్లను తీసుకువచ్చింది. పోటీ కంపెనీలతో పోల్చితే ఈ ప్లాన్లు 20-50 శాతం చవకగానే ఉన్నాయని జియో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news