దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్‌స్వీప్..

-

భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. నాలుగో రోజు ఆట మొదలైన 10 నిమిషాల్లోనే సౌతాఫ్రికా చివరి వికెట్లను కోల్పోయింది. దీంతో 3-0 తో సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకుంది. 4 వ రోజు కేవలం 2 ఓవర్లే ఆడిన సఫారీలు చేతులెత్తేశారు.

దీంతో సౌతాఫ్రికాతో సిరీస్‌ను భారత్‌ తొలిసారిగా క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు 497 పరుగుల దగ్గర డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫాలో ఆన్‌ ఆడిన సౌతాఫ్రికా టీమ్‌ 133 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇక ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందడం ద్వారా 120 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు మొత్తం 240 పాయింట్లతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news