మ‌రో సారి క్షీనించిన బంగారం ధ‌ర‌లు.. వెండి మాత్రం మ‌రింత..

-

గ‌త నాలుగు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,510రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 30 రూపాయలు తగ్గి 36,220 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగి 48,750రూపాయలకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం స్థిరంగా 38,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా 37,000 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దీంతో 48,750రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news