ఏపీలో గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

-

ఏపీలో ‘గ్రూప్-1’ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నవంబరు 12న వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలతోపాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) ప్రధాన పరీక్షల తేదీలను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్‌-1 సర్వీసెస్ మెయిన్స్‌ పరీక్షలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 1f6వ తేదీ వరకు జరగనున్నాయి. ఏడు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 4న తెలుగులో పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 5న ఇంగ్లీషులో పేపర్‌(క్వాలిఫైయింగ్‌ ఎగ్జామ్‌), 7న పేపర్‌-1, 10న పేపర్‌-2, 12న పేపర్‌-3, 14న పేపర్‌-4, 16న పేపర్‌-5 పరీక్షలు జరుగుతాయి. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(నో. నెం.10/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు ఐదు సెషన్లలో జరుగుతాయి.

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(నో.నెం.20/2018) మెయిన్స్‌ పరీక్షలు మార్చి 19, 20 తేదీల్లో మూడు సెషన్లలో నిర్వహిస్తారు. అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్స్‌(నో.నెం.16/2018) పోస్టులకు ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ నోటీసు బోర్డుతో పాటు https://psc.ap.gov.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news