బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. వెండి కూడా అదే దారిలో..

-

గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పెరిగింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,640రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 120 రూపాయలు పెరిగి 36,340 రూపాయలకు చేరింది. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 20 రూపాయలు పెరిగి 48,770రూపాయలకు చేరింది.

అలాగే ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు పెరిగి 38,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 100 రూపాయలు పైకెగసి 37,100 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 20 రూపాయలు పెరిగింది. దీంతో 48,770రూపాయలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news