వాహనదారులకు అలర్ట్‌.. హెల్మెట్‌ పై ఈ గుర్తు తప్పనిసరి!

-

బైక్‌ నడిపే ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన ఉంది. అయితే కొంతమంది నాణ్యత లేని హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పడు ప్రాణాలు విడుస్తున్నారని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ హెల్మెట్‌ నాణ్యతపై రవాణా శాఖ అధికారులు ఓ నిబంధన విధించారు. ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇంకా వేలాది మంది తమ శరీర భాగాలు కోల్పోయి, క్షతగాత్రులు కూడా అవుతున్నారు.

ఇలా ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ శాతం ద్విచక్రవాహదారులే అని పోలీసుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కూడా 85 శాతం మంది తలకు బలమైన గాయం కారణంగానే చనిపోతున్నారని అధ్యయనాల్లో తేలింది. దీంతో కేంద్ర ప్రభుత్వం హెల్మెట్‌ తప్పని సరి చేసింది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. దీంతో ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో 90 శాతం మంది వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తున్నారు.

అయితే చాలా మంది పోలీసులు విధించే చలానాలను తప్పించుకోవడానికే హెల్మెట్‌ను ధరిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుండటంతో నాణ్యత లేని హెల్మెట్‌లను కొంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న పిలియన్‌ రైడర్లు సైతం దుర్మరణం చెందుతున్నట్లు గుర్తించిన పోలీసులు పిలియన్‌ రైడర్‌కు కూడా హెల్మెట్‌ వాడటం తప్పనిసరి చేశారు. దీంతో వ్యాపారులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. జాతీయ రహదారుల వెంట, గల్లీ రోడ్ల వెంట నకిలీ హెల్మెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

ముందు ప్రజల్లో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన తేవాలనుకున్న పోలీసులూ వాటి నాణ్యతపై పెద్దగా దృష్టి సారించలేదు. దీనివల్ల ఒకవేళ ప్రమాదాలు జరిగినపుడు హెల్మెట్‌ పెట్టుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఆ హెల్మెట్‌ వాడటం వల్లె చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు పునరాలోచనలో పడ్డారు. నకిలీ హెల్మెట్ల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఈ ఏడాది జూన్‌ఒకటి నుంచే వాహనదారులు నాణ్యమైన బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) గుర్తింపు ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని వారు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ ఒకటి నుంచే వాహనదారులు నాణ్యమైన బ్యూరో ఆఫ్‌ ఇండియ¯న్‌స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) గుర్తింపు ఉన్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని వారు తెలిపారు. బీఐఎస్‌ లేని, నకిలీ హెల్మెట్‌ వాడితే జరిమానాలు విధించాలని సూచించింది. వాహనదారులకు నాసిరకం, నకిలీ హెల్మెట్లను అంటగట్టే వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఇప్పటికే సైబరాబాద్‌ లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించగా 20 మందికి పైగా వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నకిలీ హెల్మెట్‌ వాడకం వల్ల సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది కేవలం 5 నెలల్లో 145 మంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news