రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు..!

-

చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బుని నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా దేనిలోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటున్నారా..? లేదా ఏదైనా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీనిని చూడాలి. ప్రతీ నెలా కొంత మొత్తం పొదుపు చేసి భారీగా రిటర్న్స్ పొందొచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో మంచి అవకాశాలు ఇస్తోంది.

ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకుని భారీగా రిటర్న్స్ పొందొచ్చు. దీనిని కనుక తీసుకుంటే కుటుంబ సభ్యులకు ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ని ఇస్తుంది. ప్రతీ రోజు కేవలం రూ.41 పొదుపు చేస్తే…. మెచ్యూరిటీ సమయంలో రూ.63 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. 90 రోజుల వయస్సు నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారు దీనిని పొందడానికి అర్హులు.

అలానే ఈ పాలసీ తీసుకోవాలంటే కనీసం సమ్ అష్యూర్డ్ రూ.2,00,000 ఉండాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమి లేదు. 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్ల టర్మ్స్ ని ఎంచుకోవచ్చు. ఒకవేళ 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.5,00,000 సమ్ అష్యూర్డ్, 75 ఏళ్ల పాలసీ టర్మ్‌తో జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకుంటే
30 ఏళ్లు ప్రీమియం కట్టాలి.

అయితే 75 ఏళ్ల వరకు పాలసీ పని చేస్తుంది. 30 ఏళ్లపాటు ప్రతీ ఏటా రూ.14,758 ప్రీమియం చెల్లించాలి. అంటే రోజు రూ.41 పే చెయ్యాలి. వయస్సు 55 వచ్చే వరకు ప్రీమియం కట్టాలి. 75 ఏళ్ల వయస్సు వచ్చేసరికి గరిష్టంగా రూ.63,08,250 రిటర్న్స్ వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news