ఐఆర్‌సీటీసీ షిరిడీ ప్యాకేజీతో వీటన్నింటినీ చూసి వచ్చేయచ్చు..!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) షిరిడీ టూర్ ని ప్రకటించింది. దీనిలో భాగంగా షిరిడి తో సహా పలు ప్రదేశాలని చూసి వచ్చేయచ్చు. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా పర్యాటకుల్ని షిరిడీతో పాటు పండర్‌పూర్, శనిశిగ్నాపూర్, మంత్రాలయం లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు తీసుకెళ్లనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

‘షిరిడీ స్పెషల్ గురు కృప యాత్ర’ పేరుతో ఈ టూర్ ని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. అయితే ఈ రైలు తమిళనాడు నుంచి మొదలవ్వనుంది. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల పర్యాటకులు రేణిగుంటలో భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. డిసెంబర్ 24న రైలు బయల్దేరుతుంది. 6 రాత్రులు, 7 రోజుల టూర్ ఇది.

ప్రయాణికులు మదురై, దిందిగల్, తిరుచ్చిరాపల్లి, అరియాలూర్, వృందాచలం, విల్లుపురం జంక్షన్, చెన్నై ఎగ్మోర్, రేణిగుంటలో భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కచ్చు. ‘షిరిడీ స్పెషల్ గురు కృప యాత్ర’ ప్యాకేజీ ధర రూ.7,060 మాత్రమే. స్లీపర్ క్లాసులో రైలు ప్రయాణం, ధర్మశాలలు, హాల్స్‌లో బస, టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రోజూ 1 లీటర్ మంచి నీరు, నాన్ ఏసీ వాహనాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, శానిటైజేషన్ కిట్ అన్నీ కవర్ అవుతాయి.

డిసెంబర్ 24న మదురై నుంచి ఈ ట్రైన్ బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం పర్యాటకులు పండర్‌పూర్ చేరుకుంటారు. అక్కడ పాండురంగ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత షిరిడీ బయల్దేరాలి. మూడో రోజు పర్యాటకులు సాయినగర్ చేరుకొని అక్కడే బస చేస్తారు.

నాలుగో రోజు షిరిడీలో బాబా దర్శనం ఉంటుంది. ఐదో రోజు ఉదయం షిరిడీ నుంచి బయల్దేరి శనిశింగ్నాపూర్ చేరుకోవాలి. ఆరో రోజు మంత్రాలయానికి బయల్దేరాలి. నెక్స్ట్ రిటర్న్ అయ్యిపోవాలి అంతే. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో పూర్తి వివరాలని చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news