నెట్ లేకున్నా కూడా వాట్సాప్ మెసెజ్‌లు పంపొచ్చు..ఎలాగంటే?

-

ఈరోజుల్లో వాట్సాప్ లేకుండా ఉండరు ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను వాడుతున్నారు.. స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతారు. దాంతో ఈ సోషల్ మెసేజింగ్ దిగ్గజం బాగా సొమ్ము చేసుకుంటోంది. ఈ క్రమంలో తమ వినియోగదారులను పెంచుకోవడం కోసం రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ తెస్తూ మరింతమంది వినియోగదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సర్వీస్ లకు ప్రాక్సీ సపోర్టు ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ఈ గురువారం ప్రకటించింది…

 

ఈ కొత్త ఫీచర్ వల్ల ఇంటర్నెట్ లేకుండా అంతరాయం కలిగినా కూడా వాట్సాప్ ని ఉపయోగించడం కొనసాగించవచ్చు అని సమాచారం. వాట్సాప్ సమాచారం ప్రకారం, ప్రాక్సీ ఫీచర్ ఉపయోగించడం వలన ప్రైవసీ మరియు భద్రతకు ఎలాంటి హాని కలుగదు అని తెలుస్తోంది. అలాగే వ్యక్తిగత మెసెజ్ లను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సురక్షితంగా నిలువ చేయబడతాయి. “ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగినప్పుడు కూడా వాట్సాప్ పనిచేసేలా ఈ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు..

ఇకపోతే ఒక బ్లాక్ లో పోస్ట్ చేశారు..2023 లో మా ఏకైక కోరిక ఏమంటే, ఈ ఇంటర్నెట్ షట్డౌన్లు ఎప్పుడూ జరగకూడదని, ఒకవేళ అలాంటి సంఘటనలు తలెత్తినా కూడా వాట్సాప్ అనేది రన్ కావాలని ఆశ పడుతున్నాం అని, ఈ క్రమంలోనే ఇటువంటి అప్డేట్ తీసుకు రావడం జరిగిందని తెలిపారు..ఈ ఫీచర్ కోసం సెట్టింగ్ లోకి వెళ్ళి చెక్ చెయ్యాలి.. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ప్రాక్సీ సర్వర్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.. ఈ కొత్త ఫీచర్ వల్ల కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news