కరోనా మహమ్మారి ఇప్పట్లో పోయేలా కనిపించట్లేదు. రోజురోజుకి తన తీవ్రతను పెంచుతూ మానవాళిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా గమనియంగా పెరిగిపోతుంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 311 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,195కి పెరిగింది. 1,49,348 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు.
భారత్ లో కరోనా విలయతాండవం..!
-
Previous article
Next article