ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తుంది. రోజురోజుకి కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. వీటిలో 275 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా 76 ఇతర ప్రాంతాలకు చెందిన వారివని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,555కి చేరుకుంది. వీరిలో 2,906 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 90 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,559కు చేరింది.
ఏపీలో కొత్తగా 351 కరోనా పాజిటివ్ కేసులు..!
-
Read more RELATEDRecommended to you
దేశ ప్రజలను భయపెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బిజీగా ఉన్నాయి: మోడీ
పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దేశ ప్రజలను...
Ganesh -
భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి.. రోజుకి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారంటే?
వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు....
Ganesh -
ఆ విషయంలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ వెయ్యి రెట్లు నయం : మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్...
Anji N -