తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 891 కరోనా కేసులు నమోదవగా.. 5 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 10,444 కరోనా కేసులు నమోదుకాగా, వీరిలో 4361 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 5858 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు 225 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా ఈరోజు నమోదైన కేసుల్లో 719 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి.
10 వేల మార్క్ దాటిన తెలంగాణ కరోనా కేసులు..!
-
Previous article
Next article