ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తానో లేదో తెలీదంటూ సెల్ఫీ వీడియో ను చేసిన కరోనా పేషంట్…!

-

విశాఖ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ​​(విమ్స్​) లో కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నా వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ అక్కడ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ప్రాణాలతో తిరిగి ఇంటికి వెళతానో లేదోనని అతను కన్నీటి పర్యంతమయ్యాడు. విశాఖ విమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులు పడుతున్న కష్టాలపై అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. ఆసుపత్రిలో నరకం చూస్తున్నామని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లెదుటే తోటి కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని… పట్టించుకునే నాథుడే లేడని సెల్ఫీ వీడియోలో అతను పేర్కొన్నాడు. ప్రాణాలతో ఇంటికి చేరుకుంటామో లేదోనని భయాందోళన వ్యక్తం చేశాడు.

నా కళ్లెదుటే ఓ కరోనా బాధితుడు రాత్రంతా అరిచి.. అరిచి ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ, పట్టించుకోవడానికి ఎవరూ లేరని, అలాంటప్పుడు రోగులను చేర్చుకుని ఎందుకు వారి ప్రాణాలతో ఆడుకుంటారని, చాలా బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యాడు. నాకు పిల్లలున్నారు. ఇంటికి వెళ్తానో లేదోనని భయంగా ఉంది. ఆసుపత్రిలో వైద్యులు అప్పుడప్పుడు వచ్చి మాత్రలు ఇచ్చేసి వెళ్తున్నారు. ఒక్క దుప్పటి కూడా ఇవ్వటం లేదని, బాత్ రూమ్ ​లు మరీ అధ్వానంగా ఉన్నాయి అని తెలిపాడు. కరోనా కంటే ముందే ఆసుపత్రి లోని పరిస్థితులను చూసి వైరస్ బాధితులు చనిపోయేలా ఉన్నారని తెలిపాడు. ఎవరైనా చనిపోతే కనీసం శానిటైజ్ చేయకుండా ఆ బెడ్లను మరొకరికి ఇస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news