సినీ ఇండస్ట్రీలో విషాదం : కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి..!

-

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది. రోజురోజుకి వేలల్లో కేసులు, వందల్లో కరోనా మరణాలు నమోదవుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందర్నీ బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి. తాజాగా.. ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, నటుడు వీ. స్వామినాథన్(62) కరోనాతో కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్వామినాథన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కే మురళీధరన్, వేణుగోపాల్ వంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ స్థాపించిన స్వామినాథన్‌కి రెండు దశాబ్ధాలకు పైగా చిత్రసీమతో అనుబంధం ఉంది. అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ వంటి తమిళ స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలు నిర్మించారు స్వామినాథన్‌కి. లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అరణ్‌ మనై కావలన్‌ అనే చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు. ఆ తర్వాత మరెన్నో సినిమాలు నిర్మించిన ఆయన మంచి గురహింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news