బిహార్​ ఎన్నికల్లో మిత్రపక్షాలు జోడితో కలిసే పోటీ : జేపీ నడ్డా

-

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు జేడీయూ, ఎల్​జేపీలతో కలిసే బిజేపి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కచ్చితంగా విజయం సాధిస్తామని, సీఎం నితీశ్​ కుమారే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని స్పష్టం చేశారు. బిజేపి బిహార్​ రాష్ట్ర కార్యసమితి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు నడ్డా. నితీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్​జేపీ మధ్య మాటల యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తాము ఉమ్మడిగానే బరిలోకి దిగుతామని వివరించారు. కరోనా కట్టడిలో నితీశ్ కుమార్ ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు.

బిహార్​లో ప్రతిపక్షానికి సిద్ధాంతాలు గానీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గానీ లేదని విమర్శించారు నడ్డా. ప్రజలంతా భాజపా వైపే చూస్తున్నారన్నారు.బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు-నవంబరులో జరగాల్సి ఉంది. నవంబరు 29తో ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇంకా తేదీలను ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news