ఢిల్లీ పయనమైన జగన్.. ఎందుకంటే..?

-

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తిని సంతరించుకుంది. ఢిల్లీ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చర్చించ బోతున్నారు అనేదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.

Jagan

కాగా హస్తినా బయలుదేరిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా మరి కొంత మంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలు… అంతే కాకుండా రాష్ట్రంలో తమ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఇక రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం మళ్లీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు పాల్గొననున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news