అమరావతి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరు చేసే తప్పునకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందంటూ చంద్రబాబు వద్ద పలువురు సీనియర్ నేతలు ప్రస్తావించారు. చింతమనేని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు చింతమనేనిపై మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని.. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం ఆగ్రహం
By ramu
-
Read more RELATEDRecommended to you
ప్రజలకి దూరం కావడం నా దురదృష్టం: ముద్రగడ
ప్రజలకు దూరం అవడం నా అదృష్టమని మాజీ మంత్రి వైసీపీ నాయకులు...
ప్రియాంక గాంధీ: మోడీ ఇంకా మౌనంగానే వుంటారా..?
జనతాదళ్ సెక్యులర్ అధినేత దేవ్ గౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్న మీద...
ఓయూ నీటి కొరతను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
నీటి సమస్యల కారణంగా చాలా చోట్ల అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న...