హరీష్ రావు పిల్లి అరుపులకు ఎవరూ భయపడరు !

-

దుబ్బాక ఎన్నికలు టి ఆర్ ఎస్ ముఖ్య నేతలకి మింగుడు పడడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలు దుబ్బాక కు పక్కనే ఉన్నాయని, ఇక్కడ ఓటమి పాలయితె ఎలా అనే భయం హరీష్ రావు కు పట్టుకుందని అన్నారు. అందుకే బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె అన్నారు. టి ఆర్ ఎస్ బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడరని హరీష్ రావును పిల్లి అరుపులకు ఎవరు భయపడరని అన్నారు.

హరీష్ రావు తన పేరును.. అరిచే రావుగా మార్చుకోవాలని ఆమె ఎద్దేవా చేసారు. కేంద్రం నిధులపై ఆర్థికమంత్రికి స్పష్టత లేకపోవటం సిగ్గుచేటన్న ఆమె దుబ్బాకలో బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో హరీష్ రావు చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో సిద్ధిపేట, గజ్వేల్ కు.. దుబ్బాక కు సంబంధం లేదని, గజ్వేల్ , సిద్ధిపేట, సిరిసిల్ల మీ కుటుంబ చేతిలో ఉంటే.. దుబ్బాక గెలవాలని ఎక్కడైన రాసి ఉందా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news