ఆన్‌లైన్ ర‌మ్మీ.. విరాట్ కోహ్లి, త‌మ‌న్నాల‌కు కేర‌ళ హైకోర్టు నోటీసులు..

-

భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, న‌టి త‌మ‌న్నా, అజు వ‌ర్ఘీస్‌ల‌కు కేర‌ళ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ ర‌మ్మీకి వారు ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నార‌ని, వారి వ‌ల్ల యువ‌త ఈ త‌ర‌హా యాప్‌ల‌కు వ్య‌స‌న‌పరులుగా మారుతున్నార‌ని, క‌నుక ఆ యాప్‌లతోపాటు స‌ద‌రు ప్రచార క‌ర్త‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఓ బాధితుడు కేర‌ళ హైకోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.

kerala high court issues notices to virat kohli and tamanna over online rummy apps

ఆన్‌లైన్ ర‌మ్మీ యాప్‌ల‌కు కోహ్లి, త‌మ‌న్నాలే కాదు, ప‌లువురు ఇత‌ర సెల‌బ్రిటీలు కూడా ప్ర‌చార క‌ర్త‌లుగా ఉన్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా యాప్‌లకు వ్య‌స‌న‌ప‌రులుగా మారి కొంద‌రు ల‌క్ష‌ల రూపాయాల‌ను పోగొట్టుకోవ‌డంతోపాటు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్యే తిరువ‌నంత‌పురంకు చెందిన వినీత్ అనే వ్య‌క్తి రూ.21 ల‌క్ష‌ల‌ను ఆన్‌లైన్ ర‌మ్మీలో పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో అనేకం జ‌రిగాయి.

కాగా ఈ విష‌యంపై ఫిర్యాదు చేసిన స‌జీష్ అనే 32 ఏళ్ల వ్య‌క్తి మాట్లాడుతూ.. తాను ఆన్‌లైన్ ర‌మ్మీ ద్వారా రూ.6 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకున్నాన‌ని తెలిపాడు. సెల‌బ్రిటీలు ప్ర‌చార‌క‌ర్త‌లుగా ఉండ‌డం వ‌ల్ల ఈ యాప్‌ల‌కు యువ‌త ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని, ఆ యాప్‌ల ప‌ట్ల వ్య‌స‌న‌పరులుగా మారుతున్నార‌ని, దీంతో ల‌క్ష‌ల రూపాయాల‌ను పోగొట్టుకుంటూ, బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, క‌నుక ఆ యాప్‌ల‌తోపాటు వాటికి ప్ర‌చారం నిర్వ‌హించే సెల‌బ్రిటీల‌పై కూడా చ‌ర్యలు తీసుకోవాల‌ని తాను కోర్టులో వేసిన పిటిష‌న్‌లో కోరిన‌ట్లు తెలిపాడు. అయితే ఆ నోటీసుల ప‌ట్ల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news