ఏపీలో రక్తమోడిన రోడ్లు.. ఒకే రోజు ఆరుగురు మృతి !

-

తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోడాయి. మరీ ముఖ్యంగా ఏపీలో రెండు ప్రమాదాలలో ఆరుగురు మరణించారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచి వెళ్తున్న పాదచారులను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో పక్క తూర్పు గోదావారి జిల్లాలో కూడా మరో ప్రమాదం జరిగింది.

ఒక కారు కాల్వలోకి దూసుకు వెళ్ళిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అయితే అందులో ఉన్న మరో ఇద్దరు మాత్రమే క్షేమంగా బయటపడ్డారు. ,ఉగ్గురు మృతులు సురేష్ వర్మ, శ్రీనివాస రాజు, సత్యనారాయణ రాజు గా గుర్తించారు. ఆత్రేయపురం లొల్ల లాకుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మరో పక్క శ్రీకాకుళం జిల్లాలో ఒక బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి ఆరోగ్య పరిశితి విషమంగా ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news