గోల్డ్ స్మగ్లింగ్ లో ఇది పీక్స్.. ఎవరూ ఊహించని చోట దాచిన లేడీ కిలాడీ !

-

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి కిలాడి వద్ద 25.4 లక్షల విలువ చేసే 550 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ లో మగవారిని మించిపోతున్నారు ఈ లేడీ కిలాడీలు.

ఎందుకంటే ఎవరూ ఊహించని విధంగా బంగారాన్ని కరిగించి గోలీళుగా మార్చి లోదుస్తుల్లోపల మర్మంగాల్లో దాచి తరలించే ప్రయత్నం చేసిన ఒక కిలాడి లేడీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కిలాడీ లేడీ ఆట కట్టించారు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో దాచిన బంగారాన్ని సదరు లేడీతోనే అధికారుల బృందం తీయించింది. అనంతరం లేడీ స్మగ్లర్ పై కేసు నమోదు చేసి పాస్ పోర్టు సీజ్ చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news