సీఎస్ సోమేశ్ కుమార్ కు హైకోర్టు నోటీసులు !

-

కోర్టు ధిక్కరణ కేసుల విచారణ ఖర్చుల కోసం రూ. 58కోట్ల మంజూరుపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. లెక్చరర్ ప్రభాకర్ పిల్ పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరపగా… కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్లు మంజూరు చేయడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రజా ధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలన్న హైకోర్టు… ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ప్రశ్నించింది. రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్ కు ఈ సందర్భంగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  అలాగే… సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇక మిగతా విచారణను అక్టోబరు 27కి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు నిధులు విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news