సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీ వైపే.. టీడీపీలో ఓటమి భయం..!

-

లోక్‌సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. ఇంకో రెండు మూడు నెలల్లో జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు వచ్చాయంటే సర్వేల హడావుడి మామూలే కదా. తాజాగా ఏపీ లోక్‌సభ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలన్నీ వైఎస్సార్‌సీపీనే గెలుస్తుందని నొక్కి చెబుతున్నాయి. టైమ్స్ నౌ కూడా అదే విషయాన్ని తెలిపింది. టీడీపీ ఈసారి నెగ్గడం కష్టమేనని తేల్చింది.

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉండగా.. టైమ్స్ నౌ సర్వే ప్రకారం వైఎస్సాఆర్‌సీపీకి 23 సీట్లు వస్తాయట. టీడీపీకి 2 సీట్లు వస్తాయట. ఎంపీ సీట్లలో 23 వైఎస్సాఆర్‌సీపీకి వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నో డౌట్‌గా వైసీపీ అధికారంలోకి వచ్చినట్టేనని తెలుస్తోంది. వైసీపీ అలవోకగా 140 సీట్లకు పైగా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఉన్న 175 సీట్లలో 140 దాకా వైసీపీకే వస్తే టీడీపీ సంగతి. బీజేపీ పరిస్థితి ఏంది.. కాంగ్రెస్ పరిస్థితి ఏందీ.. పవన్ కళ్యాణ్ జనసేన పరిస్థితి ఏందంటూ ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news