నేడు కృష్ణా బోర్డు కీలక సమావేశం : ఎల్లుండి నుంచే గెజిట్ అమలు !

-

జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కెఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 వ తేదీ నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం అవుతోంది. గెజిట్ అమలు తో కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ మరియు ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నాయి.

water dispute | జల వివాదం
water dispute | జల వివాదం

జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని అటు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణ విద్యుత్ పేరిట నీటిని శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తుందనీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. కృష్ణ పై ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. గెజిట్ అమలు కు కొంత సమయం కావాలని గతంలో కోరిoది తెలంగాణ. ఇవాళ కృష్ణా బోర్డు సమావేశం ఉన్న నేపథ్యంలో…బోర్డ్ చైర్మన్ తో పాటు ఇరు రాష్ట్రల ఉన్నతాధికారులు, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news