రోశ‌య్య మృతిపై వైఎస్ షర్మిల ఎమోషనల్ పోస్ట్

-

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి… కొణిజేటి రోశయ్య ఇవాళ ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. రోశయ్య మృతి పై రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే… వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత.. వైఎస్‌ షర్మిల కూడా స్పందించారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, కొనిజేటి రోశయ్య ఇద్దరు కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసి… ఎమోషనల్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల.

” వైయ‌స్ఆర్ గారి ఆప్త మిత్రులు, మాజీ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య గారి మృతి బాధాక‌రం. రోశ‌య్య గారి మృతి తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి. ” అంటూ వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు.
కాగా… రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో మాజీ ముఖ్య‌మంత్రి రోశయ్య అంత్య క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. రేపు 11 గంటల తరువాత గాంధీ భవన్ కు రోశయ్య పార్థివ దేహన్ని త‌ర‌లించనున్నారు. గాంధీ భవన్ లో అభిమానుల కడసారి చూపుకోసం ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. రేపు ఒంటి గంట కు మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news