బిజెపిని లీజుకు ఇచ్చేశారు : పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఇద్దరు వ్యక్తులకు లీజుకు ఇచ్చేశారని.. సుజనా చౌదరి, సిఎం రమేష్ కు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చేశారని చురకలు అంటించారు. పార్టీ పాలసీని నిర్ణయిస్తున్నది ఆ పార్టీ అధిష్టానం కాదు…సుజనా చౌదరి, సిఎం రమేష్ లేనని నిప్పులు చెరిగారు. ఎంత ధైర్యం, స్థైర్యం లేకపోతే అమిత్ షా పరిధిలోని అంశాలను సుజనా చౌదరి చెబుతారు? అని ప్రశ్నించారు. ఏపీలోని పోలీసులను కేంద్రం టెలిస్కోప్ లో చూస్తోందట…అంటే ఢిల్లీకి ఏపీ అంత దూరంలో ఉందా? అని నిలదీశారు.

గతంలో అమరావతిని స్కాం క్యాపిటల్ అన్నారు…పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని స్వయంగా నరేంద్ర మోడీ నే అన్నారు.. మరి ఇంత వరకు ఈడీనో ఇంకోటో వేసి ఎందుకు విచారణ చేయలేదు?? అని ప్రశ్నించారు. దీని వెనుక ఏం మతలబు ఉంది ? అని మండిపడ్డారు. విభజన హామీలు ఏమయ్యాయి… వాటి పై మాట్లాడే ధైర్యం ఏపీ బీజేపీ నాయకులకు లేదా ? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు కడితే ముంపుకు గురయ్యే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా ? అని ఫైర్ అయ్యారు. దీని పై మాట్లాడరా ? బ్రాంది బుడ్డీల రేట్లు మాత్రమే తగ్గిస్తారా ? అని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news