జగన్ అనే వైరస్ కు కేంద్రం వ్యాక్సిన్ వేయాలి : పయ్యావుల కేశవ్

-

చైనాలో ఉన్న కోవిడ్ కు వ్యాక్సిన్ కనిపెట్టారని.. ఏపీ లోని జగన్ అనే వైరస్ కు కేంద్రం వ్యాక్సిన్ వేయాలని పయ్యావుల కేశవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిజెపి నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని.. దేశంలో ఉన్న బీజేపీ కి ఏపీ లో ఉన్న బీజేపీ చాలా తేడా ఉందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న బిజెపి జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని.. పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కు మన్న కేంద్ర హోంమంత్రి వెళతారన్నారు.

ఏపీ ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని.. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయ లను చేస్తుందని కేంద్ర మంత్రి ఒకరు అన్నారని చురకలు అంటించారు. కానీ ఇక్కడ సినిమా స్కోపీలో నే అన్యాయం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని.. విజయడవాడలో జరుగుతున్న బిజెపి నిర్వహిస్తున్నది ప్రజాగ్రహ సభ కాదు… జగన్ అను గ్రహ సభ అని ఫైర్ అయ్యారు. హిందూ దేవాలయలకు ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు మీద దాడి జరిగిన బిజెపి నాయకులు ఒక్క మాట కూడా అనలేదని ఫైర్ అయ్యారు. బాబాయ్ హత్య మీద ఇవాళ్టికి విచారణ లేదు.. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలు పోలీసులు అరాచకాలు పై విచారణ చేయించండని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news