ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి ఉద్యోగుల సమ్మె కావాలి.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి ఉద్యోగుల సమ్మె కావాలని.. కోరుకున్నాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ బిడ్డగా ఎవరైనా పుడుతారా.. అన్న వ్యక్తి ఈనాడు రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారని విమర్శించారు. బీసీ తోకలు కత్తెరిస్తా అన్న వ్యక్తి ఆంధ్యజ్యోతి, టీవీ 5 లకు ముద్దు బిడ్డగా ఉన్నారంటూ.. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. బీసీలు జడ్జీలుగా పనికి రారన్న వ్యక్తి కామెండ్లకు ఆత్మీయుడుగా ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే.. ఎల్లో మీడియాకు పండగ అని.. సంధి జరిగిందని, ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం లేదని తెలిసి ఏడుపు మోహం పెట్టారని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు సమ్మె విరమించారని తెలసి కమ్యూనిస్టులను ముందుకు తోచారని ఆరోపించారు జగన్ ఆరోపించారు. సీఎంని తిడితే బాగా కవర్ చేశారని ఆ ఛానెళ్లు, పేపర్లపై సీఎం అన్నారు. ప్రభుత్వంపైకి ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూశారు.. ఎల్లో మీడియాకు వాస్తవాలు కనిపించవా అంటూ సీఎం ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news