కేసీఆర్ కుటుంబం మా నాయకుల బూట్లు నాకినా… కేసీఆర్ని దరిచేరనీయం: రేవంత్ రెడ్డి

-

కాంగ్రెెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అనంతరం పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులు మా నాయకుల బూట్లు నాకినా.. కేసీఆర్ ని కాంగ్రెస్ దరి చేరనీయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని కొట్లాడుతాం.. గద్దె దించుతాం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ తో నాకు ఏదో ఉన్నట్లుగా దిక్కుమాలిన చర్యలను పాల్పడుతున్నాని అన్నారు.revanth-reddy-cm-kcr టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ రోజుకు కలవవు అని స్పష్టం చేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచనలో ప్రయత్నం చేస్తున్నాడని కేసీఆర్ ను విమర్శించారు. కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాడని..ఇది కూడా పరోక్షంగా మోదీకి సహాయం చేయడం కోసమే అని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90 సీట్లకు పైగా స్థానాలు గెలుస్తుందని..13-14 ఎంపీ స్థానాలు గెలుస్తామని.. వీటన్నింటిని దెబ్బతీయడానికి మోదీ ఆదేశాలతో.. అమిత్ షా సమన్వయంతో సుపారీ రాజకీయాలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news