BREAKING : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపీకి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను గత కొన్ని రోజుల నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పై వేటు వేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.

కొన్ని కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా గౌతమ్ సవాంగ్ కొనసాగిస్తూ వస్తోంది జగన్మోహన్రెడ్డి సర్కార్. కానీ తాజాగా ఆయనను తప్పించి విపక్షాలకు చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తుందట.

ఇందులో భాగంగానే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది జగన్ సర్కార్. ఆయన స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించేందుకు కసరత్తు మొదలు పెట్టిందట జగన్ సర్కార్. దీనిపై ఇవాళ సాయంత్రం లోగా అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news